ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎం కిసాన్ నగదు రాలేదా..ఫిర్యాదు చేయండిలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 08:40 PM

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6వ విడత డబ్బులు జమ చేసింది. అర్హులైన కొంత మంది రైతుల ఖాతాలో ఈ నగదు జమ కాలేదు. కొంత మంది రైతులు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో వారికి నగదు జమ కావడం లేదు. దీంతో వారు తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో,నగదు రావాలంటే ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.పీఎం కిసాన్ డబ్బులు రాని వారు ఓ సారి వివరాలు చెక్ చేసుకోవాలి. మీరు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉన్నాయేమో చెక్ చేయండి.కేంద్ర ప్రభుత్వం ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా డబ్బుల్ని ఒకేసారి జమ చేస్తుంది. పేర్లు మ్యాచ్ కాకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ జరగదు. డాక్యుమెంట్‌లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్‌లో మరో పేరు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది. ఆధార్ కార్డులో, బ్యాంకు అకౌంట్‌లో పేర్లు ఒకేలా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పేర్లు తప్పుగా నమోదైనట్టైతే pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో సరిచేసుకోవచ్చు.ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in/ ఓపెన్ చేయండి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి.పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించొచ్చు. pmkisan- ict@gov.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa