దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్-2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చేనెల 11 నుంచి ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 21 నుంచి 27 తేదీల మధ్య అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇక జేఈఈ అడ్వాన్డ్స్ పరీక్ష సెప్టెంబర్ 27న జరగనుంది.జేఈఈ మెయిన్ను విజయవంతంగా పూర్తిచేసినవారు అడ్వాన్స్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులోకూడా అర్హత సాధిస్తే దేశంలోని ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం సొంతం చేసుకోవచ్చు. అందువల్ల అడ్వాన్స్ రాయాలనుకునే విద్యార్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in/ చూస్తూ ఉండాలి.రిజిస్ట్రేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 11, 2020
రిజిస్ట్రేషన్లకు చివరితేది: సెప్టెంబర్ 16, 2020
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరితేది: సెప్టెంబర్ 17, 2020
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, అమ్మాయిలకు రూ.1400 ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్: jeeadv.ac.in/
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa