ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజీ రహదారి విస్తరణ కలేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 07:53 PM

రాష్ట్ర రాజధాని అమరావతి కి కర్నూలు నుంచి ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం వరకు నాలుగు లైన్ల రహదారి, వెంకటాపురం నుంచి దోర్నాల వరకు రెండు వరుసల రహదారి విస్తరణకు గత ప్రభుత్వంలో జాతీయరహదారి(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదనలు పంపింది. దీనికోసం అటవీశాఖ అనుమతులకు అప్పటి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఈ ఏడాది సైతం అదే డీపీఆర్‌ ప్రకారం రూ.1350 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఈ పనులను హెచ్‌ఏఎం పద్ధతిలో చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అనుమతులపైనే అందరి చూపు ఉంది. నిత్యం ఆత్మకూరు-దోర్నాల ఘాట్‌లో వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. సింగిల్‌ రోడ్డు కావడంతో ఘాట్‌లో ఏ వాహనమైనా అదుపు తప్పితే గంటల తరబడి ప్రయాణికులు నరకం చూడాల్సిందే. ఈ సమస్య తీరాలంటే రహదారి విస్తరణ జరగాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa