ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పెన్షన్ స్కీమ్‌లో ఉన్నవారికి సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 07:52 PM

అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో ఉన్నవారికి అలర్ట్. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చెల్లించాల్సిన డబ్బుల్ని సెప్టెంబర్ 30 లోగా జమ చేయాలి. లేకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ-PFRDA వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు చెల్లించాల్సిన అటల్ పెన్షన్ యోజన కంట్రిబ్యూషన్లకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 30 లోగానే కంట్రిబ్యూషన్స్ జమ చేయాలి. ఆ తర్వాత జమ చేస్తే మాత్రం ఎప్పట్లాగే పెనాల్టీ చెల్లించక తప్పదు. అంతేకాదు... అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో కంట్రిబ్యూషన్లకు ఆటో డెబిట్ ఆప్షన్‌ను జూలై 1న తిరిగి ప్రారంభించారు. ఒకవేళ అకౌంట్‌లో సరిపడా డబ్బు లేకపోతే ఈ స్కీమ్‌లో జమ కాదు. వాటిని స్కీమ్ లబ్ధిదారులు సెప్టెంబర్ 30 లోగా జమ చేయాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన-APY సబ్‌స్క్రైబర్లు ఆటోడెబిట్ ఫెసిలిటీ ద్వారా నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు.అటల్ పెన్షన్ యోజన-APY పథకం 2015లో ప్రారంభమైంది. ఈ ఐదేళ్లలో 2 కోట్ల 40 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు చేరారు. వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారికి ఉపయోగపడే పథకం ఇది. రూ.1000 నుంచి రూ.5000 మధ్య పెన్షన్ పొందొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో చేరి డబ్బులు జమ చేస్తూ ఉండాలి. 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ లభిస్తుంది. వయస్సు తక్కువగా ఉన్నప్పుడే ఈ స్కీమ్‌లో చేరితే జమ చేయాల్సిన మొత్తం తగ్గుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa