రాబోయే ఆరు నెలల్లో మెుబైల్ రీఛార్జ్ ప్లాన్లు భారీగా పెరుగుతున్నట్లు భారితీ ఎయిర్ టెల్ చెప్పకనే చెప్తోంది. త్వరలోనే టారిఫ్ పెంపు గురించి సంకేతాలు ఇచ్చారు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న తక్కువ ధర ప్లాన్లతో టెలికాం సంస్థలు నెట్టుకు రావడం కష్టమేనని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రూ.160కే 16 జీబీ బదులుగా వినియోగదారులు పొందాల్సింది కేవలం 1.6 జీబీ మాత్రమేనని తెలిపారు. నెలకు రూ.160కి 1.6 జీబీ సామర్ధ్యాన్ని వినియోగిస్తారో లేదా మీరు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధం అవుతారో ఎంచుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.దీన్ని బట్టి ఎయిర్ టెల్ 1 జీబీ డేటా ధరను రూ.100కు పెంచేలా ఉందని అర్థమవుతుంది. పీటీఐ కథనం ప్రకారం ప్రస్తుతం యూఎస్, యూరోప్ దేశాల తరహాలో 16 జీబీ డేటాకు 50-60 డాలర్లు(సుమారు రూ.3,700-రూ.4,400) వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే మనదేశంలో అంత కాకపోయినా కనీసం రెండు డాలర్లు(సుమారు రూ.160) చెల్లించడానికి వినియోగదారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వినియోగదారులు రూ.160 చెల్లించి 16 జీబీ పొందడం వ్యాపార పరంగా బాధను కలిగిస్తుందని ఆయన తెలిపారు. నిజానికి వినియోగదారులకు ఈ ధరకు కేవలం 1.6 జీబీ మాత్రమే అందించాలని సూచించారు.దీన్ని బట్టి చూస్తే 1 జీబీ డేటాకు రూ.100 చెల్లించాలని సునీల్ మిట్టల్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ రూ.199 ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ డేటాను 24 రోజుల పాటు అందిస్తోంది. ఒకవేళ ఎయిర్ టెల్ మిట్టల్ ఆశిస్తున్న రేటుకు పెంచితే ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా కేవలం 2.4 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. టెలికాం సంస్థలకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రకారం డిజిటల్ కంటెంట్ వినియోగంపై పెరిగింది కాబట్టి రాబోయే ఆరు నెలల్లో ఎయిర్ టెల్ రూ.200 దాటాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.30జూన్ 2020న ముగిసిన మెుదటి త్రైమాసికంలో ఎయిర్ టెల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ లో 157 రూపాలయలకు పెరిగినట్లు నివేదించింది. 2019 డిసెంబర్ లో ఎయిర్ టెల్ టాక్ టైం ధరల్ని పెంచడంతో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరిగినట్లు తెలిపారు. యావరేజ్ రెవెన్యూ పర్ యాజర్ రూ.300 పెరగాలని భావిస్తున్నట్లు చెప్పిన మిట్టల్ ప్రస్తుతం నెలకి రూ.100కే ఎక్కువ డేటాతో టీవీ చూడటం, సినిమాలు చూడటం వంటివి చేస్తే వాటికి వినియోగదారులు ఆ అదనపు డేటాకు నగదు చెల్లించాల్సిందేనన్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో రూ .200 మార్కును దాటాలి మరియు 250 రూపాయలు ఇంకా అనువైనవన్నారు.టెలికాం లేని వ్యాపారాలు డిజిటల్ వైపు చూడాలన్నారు. దానికి ఇంకా సమయం పడుతుందని ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్రకటించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa