ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంసెట్‌ అభ్యర్థులకు గమనిక.. పరీక్షల టైమింగ్స్‌లో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 07:32 PM

కరోనా కారణంగా ఎంసెట్ పరీక్షల టైమింగ్స్‌లో సల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి.‌ తెలంగాణలో సెప్టెంబర్ 9, 10, 11, 14, 28, 29 తేదీల్లో, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 17, 18, 21, 22, 23, 24, 25 తేదీల్లో ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్‌ను ప్రకటించాయి. కానీ పరీక్షలు నిర్వహించే టైమింగ్స్ మాత్రం ప్రతీసారిలా కాకుండా కొంచెం మార్పులు ఉండనున్నాయి.ఉదయం, మధ్యాహ్నం సెషన్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా ప్లాన్ చేశారు. ఉదయం సెషన్ 9 గంటలకే ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం సెషన్ 3 గంటలకు మొదలవుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పరీక్షా కేంద్రంలో శానిటైజేషన్ చేస్తారు. కాబట్టి విద్యార్థులు ఈ పరీక్ష వేళల్ని దృష్టిలో పెట్టుకోవాలి. టైమింగ్స్‌లో మార్పులతో పాటు పరీక్షా కేంద్రం దగ్గర అనేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. పరీక్షా కేంద్రాల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా చర్యలు తీసుకుంటారు. శానిటైజర్, హ్యాండ్ వాష్ అందుబాటులో ఉంటాయి.విద్యార్థులు పరీక్షా కేంద్రాల లోపలికి వచ్చేముందే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. కరోనా లక్షణాలు ఉన్న విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఐసోలేషన్ కేంద్రంలోనే వాళ్లు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐసోలేషన్ కేంద్రంలో పనిచేసే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్స్ అందజేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa