ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్ నిబంధనలకు లోబడి మొహర్రం జరుపుకోండి: ఎస్సై మల్లికార్జున

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 26, 2020, 02:09 PM

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మల్లికార్జున ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మొహరం పండుగ జరుపుకొనుటకు నియమ నిబంధనలు తప్పసరిగా పాటించాలని సూచించారు. మండలంలోని పులకుర్తి, కళ్లపరి, వర్కూరు, బైన్ దొడ్డి గ్రామల్లో పర్యటించి మొహర్రం వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను వివరిస్తూ నిబంధనలకు లోబడి జరుపుకోవాలని సూచించారు.కరోనా వైరస్ నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ ఉత్తర్వుల మేరకు కోడుమూరు సర్కిల్ సీఐ పార్థసారథి రెడ్డి ఆదేశాలతో కోడుమూరు ఎస్సై మల్లికార్జున వారి సిబ్బందితో కలిసి పులకుర్తి , కలపరి మరియు బైన్ దొడ్డి గ్రామాలను సందర్శించి ప్రజలకు కింది సూచనలు చేయడమైనది.మొహర్రం వేడుకల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి.


1.సాంప్రదాయ ప్రకారం పీర్లను యధావిధిగా పీర్ల చావిడి లో మాత్రమే ప్రతిష్టించాలి. 2.ప్రజలు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి. 3.మాస్కులు ధరించాలి, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. 4.గ్రామంలో ఎక్కడ కూడా తప్పెట్లు కొడుతూ శావ్ సోనీ ఆడరాదు. 5.పీర్ల సామూహిక ఊరేగింపులు అనుమతించబడవు. కోడుమూరు మండలంలో సెక్షన్.30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరైనా పైన పేర్కొన్న నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కోవిడ్ నియమ నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa