ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 26, 2020, 02:01 PM

కుడిగట్టు జల విద్యుత్తుకేంద్రంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ జెన్‌కో హైడల్‌ డైరెక్టర్‌ జి.చంద్రశేఖర్‌రాజు తెలిపారు. మంగళవారం ఆయన కుడిగట్టు జల విద్యుత్తుకేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్తుకేంద్రం పనితీరుపై పరిశీలించి ఇంజినీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎడమగట్టు జల విద్యుత్తుకేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా కుడిగట్టుకేంద్రం భద్రతపై ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హైడల్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ...కుడిగట్టు కేంద్రంలో సీజనల్‌ నిర్వహణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. కుడిగట్టు జల విద్యుత్తుకేంద్రంలో వారం రోజులుగా 95 మి.యూ విద్యుత్తును ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. విద్యుత్తు ఉత్పత్తి సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటే చర్చించి పరిష్కరించడానికి ఇంజినీర్లతో వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. హైడల్‌ డైరెక్టర్‌ వెంట ముఖ్య ఇంజినీర్‌ నరసింహారావు, తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa