ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జువారి సిమెంట్ చేయూత అభినందనీయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 26, 2020, 01:59 PM

కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ పరిధిలోని నంద్యాల పట్టణంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణ కార్మికులు జువారీ సిమెంట్ యాజమాన్యం సహాకారంతో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జువారీ సిమెంట్ యాజమాన్యం కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. ప్రదమనందిలోని గాయత్రీ దేవాలయంలో జువారీ సిమెంట్ అన్నం సెర్వింగ్ దా సొసైటీ ఆధ్వర్యంలో 600 మంది కార్మికులకు ఎమ్మెల్యే చేతులమీదుగా నిత్యవసరవస్తువులు పంపిణీ చేశారు.కరోనా విపత్కర పరిస్థితులు ఎదురుకొంటున్న భవన నిర్మాణ కార్మికులకు జువారి సిమెంట్ కంపెనీ అందిస్తున్న చేయూత అభినందనీయమని అన్నారు. ప్రతి సంస్థ యాజమాన్యాలు కార్మికులకు చేయూత అందిస్తూ ఆదుకోవాలని సూచించారు. రాయలసీమ ఇంచార్జ్ కిషోర్ మాట్లాడుతూ తమ కంపెనీ ప్రపంచంలోనే అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్న హెడల్బర్గ్ గ్రూప్ వారి జువారి సిమెంట్ సామాజిక బాధ్యతగా బస్తాకు ఒక్క రూపాయి కేటాయించి భారతదేశం అంతటా నిత్యవసర వస్తువులు నిరుపేదలకు పంపిణీ చేస్తుందన్నారు. కర్నూలు జిల్లా ఇంచార్జ్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనాతో ఉపాధి కోల్పోయిన నంద్యాల భవన కార్మికులకు ఒక వారం సరిపడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అధీకృత డీలర్లు మద్దిలేటి, హుస్సేన్, వెంకటరెడ్డి, నాగార్జున, చక్రధరరెడ్డి, కంపెనీ సీనియర్ అధికారి నాగేంద్ర యాదవ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa