సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 20 నుండి 26వ తేదీ వరకు 16 రకాల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మహానంది మండలం డిప్యూటీ తహసిల్దార్ నారాయణరెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని సిపిఎం నాయకులు లక్ష్మణ్, ప్రజా సంఘాల నాయకులు సోమన్న, మధులతో పాటు మరో 15 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.అనంతరం సిపిఎం నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ... ఆదాయపు పన్ను కట్టని అన్ని కుటుంబాలకు నెలకు రూ .7500 ఆర్థిక సహకారం ఆరు నెలలు అందించాలి. ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలు 6 నెలలపాటు ఇవ్వాలి. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. పట్టణాలకు వర్తింపజేయాలి. నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతీ యువకులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa