ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో దారుణం.. తండ్రిని చంపిన తనయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 26, 2020, 01:36 PM

మద్యానికి బానిసైన ఓ తండ్రి భార్యను వేధిస్తుండటంతో కోపోద్రిక్తుడైన కుమారుడు కర్రతో తండ్రిని కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని మీర్జాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీను (48) తాగుడుకు బానిసై నిత్యం తన భార్య లక్ష్మీదేవిని వేధించేవాడు. మంగళవారం కూడా మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. ఇది చూసిన కుమారుడు నరేంద్ర.. తన తల్లిని కొట్టవద్దని తండ్రిని వారించాడు. ఆ సమయంలో కుమారుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో కుమారుడు పక్కనే ఉన్న కర్రతో తండ్రి తలపై కొట్టాడు. తీవ్ర గాయం కావటంతో తండ్రిని వైద్యం కోసం కొలిమిగుండ్లకు తీసుకు వెళ్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరినాథరెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa