ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదోనిలో భారీ చోరీ.. 80 తులాల బంగారం..3 కిలోల వెండి..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 26, 2020, 01:35 PM

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎస్కేడీ కాలనీలో భారీ దొంగతనం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఎస్కేడీ కాలనీలో నివాసం ఉంటున్న బద్రీనాథ్ కంసాలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన తల్లి అనుసూయకు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం ఈనెల 15న బెంగళూరుకు వెళ్లారు. అతని కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్లారు. 24వ తేదీన బాధితుడి భార్య అనిత ఇంటికి వచ్చి చూడగా తాను వేసిన తాళానికి మరో తాళం ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించింది. బద్రీనాథ్ బెంగళూరు నుంచి మంగళవారం ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లో ఉంచిన 800 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐలు శ్రీరాములు, నరేష్ బాబు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa