ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణాపురం గ్రామంలో తొలగని పారిశుధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 23, 2020, 07:19 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలో పారిశుధ్యం పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు-అమరావతి ప్రధాన రహదారిని అనుకొని ఉన్న ఈ గ్రామంలో ఎక్కడ చూసిన దుర్గంధంతో కూడిన మురికి నీరే దర్శనమిస్తుంది. అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామంలో త్రాగునీటి ట్యాంక్ వద్ద వర్షపు నీరు నిలిచి పాకుడు పట్టిందని తెలిపారు. ప్రమాదవశాత్తు నీరు కలుషితమై ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యతగా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామంలో మురికినీటి కాలువలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa