ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ క్షేత్రంలో మరో ముగ్గురికి పాజిటివ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 23, 2020, 06:57 PM

పుణ్యక్షేత్రాలను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలోని పుణ్యక్షేత్రాలను కరోనా చుట్టేసింది. మొదట్లో నందవరం చౌడేశ్వరి దేవి ఆలయ సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. ఇటీవలే యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఐదుగురికి కరోనా మహమ్మారి సోకింది. తాజాగా మరో ముగ్గురికి నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్ గా నమోదైంది. ఇప్పటికే ఆలయాన్ని 31వ తేదీ వరకు మూసివేసి, నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa