ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 23, 2020, 06:51 PM

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కీలక సాక్షులైన సుశాంత్‌ ఇంటి వంట మనిషి నీరజ్‌, అతడి మిత్రుడు సిద్ధార్థ్ పితానీ లను అధికారులు ప్రశ్నించారు. సుశాంత్ పదేపదే గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని నీరజ్ సింగ్ చెప్పినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంట్లోనే వారానికి కనీసం రెండు సార్లు పార్టీ చేసుకునే వాడని, సుశాంత్‌ చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా తాను గంజాయితో నింపిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని తెలిపాడు. సుశాంత్ స్నేహితుడు, అతడి క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితానీ కూడా ముంబైలోని సీబీఐ బృందం ఉన్న డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌కు ఆగస్ట్ 23 ఉదయం వచ్చి కొన్ని వివరాలు ఇచ్చాడు. అందులో సుశాంత్ సింగ్ వాడిన మొబైల్ కూడా ఈయన పేరు మీదే ఉండటం గమనార్హం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు గంజాయి అలవాటు ఉంది అంటూ చెప్పడం చూస్తుంటే విలన్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa