చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థిని పాలిట కీచకుడు అయ్యాడు. పాఠాలు చెప్పాల్సిన మాస్టారు రాసలీలలు చేశాడు. ఫలితం ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యింది. పోలీసుల కథనం మేరకు..అస్సాంలోని దిబ్రూగడ్ లో ఉపాధ్యాయుడు రజ్జు (పేరు మార్చాం) విద్యార్థిని కనిష్క( పేరు మార్చాం)ను ప్రైవేటు పాఠాలు చెబుతానని చెప్పి తన దగ్గరకు ట్యూషన్ కు పంపమన్నాడు. దీంతో బాధితురాలు తన కళాశాల కూడా లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడి వద్దకు ప్రైవేటు పాఠాలు చెప్పించుకునేందుకు కనిష్క వెళ్లడం ప్రారంభించింది. మొదట వారం రోజులూ అంతా బాగానే ఉంది. అయితే రాను రాను అతడి చూపులు మారిపోయాయి. స్టూడెంట్స్ అంతా వెళ్లిపోయాక కనిష్కను డౌట్స్ తీర్చుతానని ఆగమనేవాడు. అందరూ వెళ్లిపోయాక, ఆమె శరీర భాగాలను నిమిరేవాడు. ఇది గమనించిన కనిష్క, కాస్త అయిష్టంగా వ్యవహరించేది. అయితే మాస్టారు గురించి బయట చెబితే తనకు చదువు ఆగిపోతుందనే భ్రమతో ఆమె అతడి గురించి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు.ఇదే అదనుగా మాస్టారు రెచ్చిపోయాడు. మూడు నెలల క్రితం తన బర్త్ డే అంటూ కనిష్కను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. కేకులో మత్తు మందు కలిపి ఆమెకు తినిపించాడు. స్పృహ కోల్పోయిన యువతిపై ఆ మాస్టారు తన పశువాంఛ తీర్చుకున్నాడు. అనంతరం వీడియో తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ క్రమంలోనే యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత వారం యువతి అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు జరపగా, గర్భవతి అని తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. యువతి కుటుంబ సభ్యులు మాస్టారుని దిగ్బంధించి దేహశుద్ధి చేయగా, పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa