కొన్నాళ్ల క్రితం వరకూ మహిళలు ఇంటికే పరిమితమయ్యే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. రకరకాల వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. అయితే ఈ శాతం చాలా తక్కువగానే ఉంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడంతో ఇంకా మహిళలు ఈ సొసైటీలో వివక్షతకు గురవుతూనే ఉన్నారు. అందుకే మహిళలకు ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు కొన్ని స్కీమ్లతో ప్రభుత్వం వారికి రుణాలు అందిస్తుంది. అలాంటి పథకమే అన్నపూర్ణ స్కీమ్.అన్నపూర్ణ పథకం కింద ఫుడ్ క్యాటరింగ్, టిఫిన్ సెంటర్ వంటి వ్యాపారాలను పెట్టుకునేందుకు రూ.50000 వరకూ రుణాలను అందించడం జరుగుతుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, భారతీయ మహిళా బ్యాంక్లు ఈ లోన్లు అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని 36 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు. ఈ డబ్బును క్యాటరింగ్కు అవసరమయ్యే వంట సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. అంటే వంటలకు అవసరమయ్యే పాత్రలు, కత్తులు, గ్యాస్ కనెక్షన్, రిఫ్రిజిరేటర్, మిక్సర్ గ్రైండర్ వంటి వస్తువులును కొనుగోలు చేసుకోవచ్చు.అయితే రుణానికి సరిపడా ఆస్తులను బ్యాంకులో పెట్టాల్సి ఉంటుంది. ఈ లోన్లో ఇంకో మంచి అవకాశం కూడా ఉంది. ఈ రుణాలు తీసుకున్నవారు మొదటి నెల EMIను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లోన్పై మార్కెట్ రేటు, సంబంధిత బ్యాంకుపై ఆధారపడి వడ్డీ రేటు ఉంటుంది. తీసుకున్న 50 వేల నుంచి 36 నెలలు అంటే దాదాపు మూడు సంవత్సరాలకు నెమ్మదిగా కట్టుకోవచ్చు.బిజినెస్ చేసి తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే ఆడవాళ్లకు ఇదొక మంచి అవకాశం. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa