న్యూఢిల్లీ : వచ్చేనెల 17 నుంచి ఆగస్టు 11 వరకు రాజ్యసభ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. వచ్చేనెల 17న రాజ్యసభను సమావేశ పరిచి ఆగస్టు 11 న ముగించాలని రాష్ట్రపతి ఆదేశించారని రాజ్యసభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తేదీల్లో పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం ఇంతకుముందే రాష్ట్రపతికి సిఫారసు చేసింది.