ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో ఆరుగురి మృతదేహాలు లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 21, 2020, 02:45 PM

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే జరగకూడదని కూడదని అందరూ కోరుకున్నారో అదే జరిగింది. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మందిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. లోపల రెస్క్యూ సిబ్బంది గాలిస్తుండగా ఏఈ సుందర్ నాయక్ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత మరో ఐదుగురి మృతదేహాలు కనిపించాయి. అగ్నిప్రమాదం తర్వాత డీఈ శ్రీనివాస్, ఏఈలు సుందర్, వెంకట్రావు, ఫాతిమా, మోహన్ కుమార్, ఫ్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్‌తో పాటు ఆమ్రాన్ కంపెనీకి చెందిన వినేష్, మహేష్ లోపలే చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 35 మందితో కూడిన రెస్క్యూ టీమ్ పవర్ ప్లాంట్‌లోకి వెళ్లి గాలిస్తోంది. రెండు, మూడు ఫ్లోర్ల వరకు వెళ్లి అంతటా గాలించారు. కానీ ఉద్యోగుల ఆచూకీ మాత్రం కనిపించలేదు.


నాలుగు, ఐదో ఫ్లోర్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ విపరీతమైన వేడి, పొగ ఉండడంతో వెళ్లలేకపోయారు. అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ లోపలికి వెళ్లి గాలించగా ఆరుగురి మృతదేహాలు దొరికాయి.గురువారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం (తెలంగాణ జెన్‌కో)లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసింందే. మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.


పెద్ద పెద్ద పేలుడు శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. పవర్ హౌస్ లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో ఏడుగురు టీఎస్ జెన్‌కో ఉద్యోగులు, ఇద్దరు అమర్ రాజా కంపెనీ సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాలగంగ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో 19 మంది ఉన్నారు. 10 మందిని క్షేమంగా బయటపడగా.. మరో 9 మంది మాత్రం లోపలే ఉండిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa