ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘ‌నంగా రాజీవ్ గాంధీ 76వ జయంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 20, 2020, 07:06 PM

ఆదోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఆదోని నియోజ‌క‌వ‌ర్గ ఇవ‌ఛార్జి బి. నీలకంఠప్ప, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సేవాదళ్ అధ్యక్షుడు దీలిప్ డోకా గురువారం పూలమాల వేసి 76వ జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. వారు మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశంలో యువ‌త‌కు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించడం, నేరుగా పంచాయతీ నిధులు పంచాయతీలకు కేటాయించడం, భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాడం ఇలా ఎన్నో కార్యాక్రమాలు రాజీవ్ గాంధీ తీసుకొచ్చార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి. తాయన్న‌, ఎండి నూర్, జైరామ్, మద్దిలేటి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa