రైల్వే, బ్యాంకులు, భీమా కంపెనీలు, బొగ్గు గనులు, చమురు కంపెనీలు, రక్షణ రంగంతో సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, దేశ ఆర్థిక వ్యవస్థను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతూ కార్మిక చట్టాల్లో కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా తెచ్చిన మార్పులు, వ్యవసాయ రంగంలో రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా తెచ్చిన ఆర్డినెన్సులు, వలస కార్మికులు, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పనలో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు గురువారం 22 గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, మండల కార్యదర్శి వెంకటేశులు, పట్టణ కార్యదర్శి లక్ష్మన్న మాట్లాడుతూ ఆరు నెలల పాటు నెలకు రూ.7500 ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలు ఆర్థిక సాయం అందించాలని, ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ఆహార ధాన్యాలు ఆరు నెలలపాటు పంపిణీ చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులు పెంచాలని, ఉపాధి పని పట్టణాలకు కూడా వర్తింప చేయాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని, కార్మిక చట్టాల సవరణ రద్దు వంటి అన్ని ప్రయాణాలు నిలిపివేయాలని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, వికలాంగుల రిజర్వేషన్లు అమలు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికై సచివాలయం ముందు సిపిఎం నాయకులు రామాంజనేయులు, గోపాల్, శేఖర్, తిక్కప్ప, వలి, లక్ష్మన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa