శ్రీనగర్ : రాష్ట్రపతి పదవికి ఎన్డిఎ అభ్యర్థిగా పోటీ చేస్తున్నరామ్నాథ్ కోవింద్ బుధవారం జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో సమావేశమయ్యారు.వీరితో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు. అలాగే జమ్ము కాశ్మీర్కు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు.