ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 20, 2020, 06:59 PM

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి దామోదరం రాధాకృష్ణమూర్తి స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘన నివాళి అర్పించారు. సాంకేతిక విప్లవ సారధి స్వర్గీయ రాజీవ్ గాంధీ 76వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంచార్జ్ అయిన దామోదరం రాధా కృష్ణమూర్తి స్థానిక సీ క్యాంపు సెంటర్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ... ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకు పోతున్న వేళ, మన దేశంలో సాంకేతిక విప్లవం రావాలని, దేశానికి మొట్ట మొదటి కంప్యూటర్ ను ఇవ్వడమే కాకుండా సాంకేతిక రంగంలో నూతన శకానికి శ్రీకారం చుట్టారన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి, స్థానిక సంస్థలను బలోపేతం చేసిన వ్యక్తి అని, అలాగే యువత అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పోతుల శేఖర్, గార్గేయపురం రియాజ్, దూద్ పీరా, తడికెనపల్లె రాజు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa