ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన వరద ఉధృతి.. ఏడు గేట్లు ఎత్తివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 20, 2020, 06:56 PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుండటంతో బుధవారం మూడు గేట్లు తెరిచి నీటిని విడుదల చేసిన అధికారులు గుర్తించారు. ఉదయం రెండు, మధ్యాన్నం మరో రెండు గేట్లు తెరిచి మొత్తం ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,92,990 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మరోవైపు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 81వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ లో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను 883.90 అడుగుల నీటి మట్టం, పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను 209 టీఎంసీల నీరు నిల్వ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa