ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా బారిన పడిన మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 20, 2020, 06:51 PM

నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎస్. హసీనా బేగం గురువారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన మహిళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుందని ఆమె అన్నారు. గురువారం స్థానిక ఉమెన్స్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ... అనేక మంది మహిళలు కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బారిన పడి చనిపోయిన ప్రతి మహిళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒక మహిళ చనిపోతే ఆ కుటుంబం చాలా విధాలుగా నష్టపోతుందన్నారు. సమాజంలో మహిళల ఆవశ్యకత ఎంతో అవసరమని, మహిళలను తల్లిలా, దేవతల పూజించే గొప్ప సంస్కృతి మనదేశంలో ఉందని... కావున మహిళలను గౌరవించి కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన మహిళ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం వలన వారి కుటుంబాలకు ఎంతో ఆసరా అవుతుందని ఆమె అన్నారు. మహిళలు స్వచ్ఛందంగా నేషనల్ ఉమెన్స్ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అంతే కాకుండా మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa