ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా నది తీరంలో డీఎస్పీ వెంకట్రావ్ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 08:11 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నెహ్రునగర్, ముర్వకొండ, పాత ముచ్చుమర్రి, ఘణపురం గ్రామాల్లోని కృష్ణా నది తీర ప్రాంతంలో మంగళవారం ఆత్మకూరు డీఎస్పీ జె.వెంకట్రావ్ పర్యటించారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో, సమీప గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ సందర్భంగా డీఎస్పీ జె.వెంకట్రావ్ తెలిపారు. సప్త నదులు కలిసే సంగమేశ్వరం ప్రాంతాల్లో నదీ జలాల ప్రవాహం మరింత ఉదృతంగా ఉండడంతో పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే శ్రీశైలం బ్యాక్ వాటర్ పై పుట్టి ప్రయాణాలు, చేపల వేట నిషేధించినట్లు గుర్తు చేశారు. వీరి వెంట నందికొట్కూరు రూరల్ సి.ఐ ప్రసాద్, ముచ్చుమర్రి ఎస్.ఐ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa