మంత్రాలయం నియోజకవర్గంలో నిజానిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని కౌతాళం మండల వైసీపీ నాయకులు అత్రితనయగౌడ్, ఏకాంబరరెడ్డి, విరుపాకప్ప లు అన్నారు. వారు మాట్లాడుతూ... కొంతమంది తమ స్వార్థం కోసం తమ పనులను చేసుకునేందుకు లేనిపోనివి కల్పించి చెబుతున్నారని, ఆ విషయాలపై పురుషోత్తం రెడ్డి, సంపూర్ణంగా తెలుసుకొని ఆరోపణలు చేయాలని కోరారు. ఏకాంబరరెడ్డి మాట్లాడుతూ... ఉప్పారహాల్ లో పొలం విషయంలో మహాదేవ, తిక్కమ్మల మధ్య తగాదా వచ్చిందని, అది రెవెన్యూ పరిధిలో ఉందన్నారు.అలాగే అత్రితనయగౌడ్ మాట్లాడుతూ... చిరుతపల్లి పొలం విషయంలో స్వార్థపరులు లేనిపోనివి చెప్పి తమ పనులకోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని, తమ వద్దకు వారికి మేలు చేయాలనుకుంటే సంపూర్ణంగా విషయాన్ని తెలుసుకొని ఆరోపణలు చేయాలని, పెద్దలు, అనుభవం ఉన్నవారు ఇలాంటివి చెప్పనవసరం లేదని, ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని, ప్రజల కోసమే మీరు పనిచేస్తున్నారని, వ్యక్తిగత వైషమ్యాలు మనలో లేవు, అలాంటప్పుడు నిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa