ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పెన్మత్స ఏకగ్రీవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 08:03 PM

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నేత పెన్మత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఓ ప్రకటన చేశారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు మరణించగా, ఆయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు పార్టీ హైకమాండ్ చేయూతనిచ్చింది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక కోసం పెన్మత్స సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. దాంతో శాసనమండలిలో వైసీపీ బలం 11కి పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa