ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజూ మజ్జిగ తాగితే అనేక ప్రయోజనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 07:53 PM

రోజూ మజ్జిగ తాగితే అనేక రకాల ప్రయోజనాలుంటాయి. పెరుగులో పాలలో ఉండే పోషకాలన్నిటితోపాటు మన శరీరానికి ఉపయోగపడే ‘లాక్టోబాసిల్లై’ అనే బాక్టీరియా ఉంటుంది. పెరుగును నేరుగా కంటే మజ్జిగ రూపంలో తీసుకుంటే త్వరగా అరుగుతుంది. అలా కాకుండా కాఫీ, టీలకు బదులుగా మజ్జిగ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం లేవగానే మజ్జిగ తాగటం వలన జీర్ణ సమస్యలు లేకుండా రోజంతా హాయిగా ఉంటుంది. ముఖ్యంగా కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు ఉదయం పరగడుపున మజ్జిగ తాగితే ఆ సమస్యలు అన్ని చాలా తక్కువ సమయంలోనే తగ్గిపోతాయి.మజ్జిగలో ఉన్న పోషకాలు మన శరీరానికి అన్ని రకాలుగా సహాయపడతాయి. హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.మజ్జిగలో అర స్పూన్ మిరియాల పొడి, కరివేపాకులు వేసుకొని తాగితే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గటమే కాకుండా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. మజ్జిగలో అరస్పూన్ అల్లం రసం కలుపుకొని తాగితే విరేచనాలు తగ్గుతాయి.వడదెబ్బ నుంచి రక్షణ ఇవ్వడమేకాదు రోజూ మజ్జిగ తాగేవాళ్ళకు ఏ జబ్బులు రావు. నీరసంగా ఉండటం, బరువు పెరగడం, చర్మ రోగాలు, క్షయలాంటి సమస్యల నుంచి ఇది బయటపడేస్తుంది. గ్యాస్, ఉబ్బరం, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్దత, పేగుల్లో వచ్చే వ్యాధులు త్వరగా తగ్గుతాయి.డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ. ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు. మజ్జిగ త్రాగటం వలన జీర్ణాశయం, పేగులలో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణాశయ సమస్యలు రాకుండా కాపాడుతుంది.మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు.రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.రక్తపోటు ఉన్నవారు మాత్రమే ఉప్పు మజ్జిగలో వేసుకోకూడదు.మిగతావారు మజ్జిగలో ఉప్పు వేసుకోవచ్చు.ఎందుకంటే ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa