ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘కరోనా వస్తే రూ.50 వేలు క్యాష్ బ్యాక్’..షోరూం వింత ఆఫర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 07:48 PM

కరోనా తాండవిస్తోన్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులను విక్రయించే షోరూంల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో కస్టమర్లను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కేరళలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాప్ ఇలాగే ప్రకటించిన ఓ ఆఫర్ బెడిసికొట్టింది. కరోనా కారణంగా కస్టమర్లు రావడం లేదు కాబట్టి కరోనా భయం లేదనే ఉద్దేశంతో ఆ షోరూం ఆఫర్ ప్రకటించినప్పటికీ అది కాస్తా వివాదాస్పదమైంది. ‘మా దగ్గర షాపింగుకొచ్చిన కస్టమర్లు 24 గంటల్లో కరోనా బారిన పడితే రూ.50 వేలు క్యాష్ బ్యాక్ ఇస్తా’మని ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేపర్లు, టీవీలు, డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొట్టాయం జిల్లా పాల మున్సిపాలిటీ కౌన్సిలర్, లాయర్ అయిన బిను పులిక్కక్కందం ఈ ప్రకటన చట్ట వ్యతిరేకం, శిక్షార్హమని భావించాడు. అప్పటికే కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా క్యాష్ బ్యాక్ కోసం ఆశపడి తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెట్టి ఈ షోరూంకు వెళ్లే ప్రమాదం ఉందంటూ సీఎంకు ఫిర్యాదు చేశాడు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న వారెవరైనా డబ్బు కోసం ఆశపడి కరోనాను కొని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదని కూడా ఆ లాయర్ హెచ్చరించాడు. దీంతో ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తికి ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నాడు. తన లాభాపేక్ష కోసం ఈ షాపు యజమాని సామాజిక బాధ్యతను మరచిపోయి వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దీంతో పలానా సెక్షన్ల కింద షాపు యజమానిపై కేసు నమోదు చేయొచ్చని సూచించాడు. షోరూం ప్రకటన వివాదాస్పదం కావడంతో పోలీసులు దుకాణాన్ని మూసేయించారు. కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa