కర్నూలు జిల్లాలో ఆన్ లైన్ తరగతులను తక్షణమే రద్దుచేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి(డి.ఆర్.ఓ) పుల్లయ్యకి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు ఎస్. శరత్ కుమార్ మాట్లాడుతూ... కర్నూలు జిల్లాలో తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీ కి పాల్పడుతున్నయని వారు అన్నారు. ఫీజులు చెల్లిస్తేనే లింకును పంపిస్తామని, లేకపోతే ఈ విద్యా సంవత్సరానికి మీకు అర్హత లేదని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తున్నారని అన్నారు.ఆన్లైన్ క్లాసుల విద్యార్థులు అనారోగ్యపాలవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు నిర్వహించకూడదని చెప్తున్న కూడా , ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి యథేచ్ఛగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని అన్నారు. అన్ని తెలిసిన విద్యా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. అంతే కాకుండా ప్రభుత్వంతో సంబంధం లేకుండా కమిషనర్ ఆఫీస్ నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవాలని ఉత్తర్వులు జారీచేయడం సమంజసం కాదన్నారు. విద్యార్థుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఆన్లైన్ తరగతులపై స్పష్టత ఇవ్వాలని, ఒకవేలా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలనుకుంటే ప్రభుత్వం ప్రతి విద్యార్థికి స్మార్ట్ ఫోన్ ను ఉచితంగా అందజేయాలని వారు అన్నారు. లేకపోతే తక్షణమే ఆన్లైన్ తరగతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు. లేనిపక్షంలో ఆన్లైన్ తరగతులకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు కళ్యాణ్, సుంకన్న, హరీష్, ఇమ్రాన్, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa