రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ లో భాగంగా ఇంటి పట్టాల సంబంధించిన పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం గ్రామ సమీపంలోని 376 ఎకరాలలో అర్హులైన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కోసం సిద్ధం చేసిన లే అవుట్ లను జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జె సి రవి పట్టన్ షెట్టిలతో కలిసి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేయనున్నా ఇంటి స్థలాలు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన లే అవుట్లు, లబ్ధిదారుల జాబితా, ఛాయాచిత్రాల అప్ లోడింగ్ పనులన్నీ సత్వరమే పూర్తి కావాలని ఆదేశించారు. ఇంటర్నల్, అప్రోచ్ రోడ్లు, హద్దులు, రాళ్లు పాతడం, విద్యుత్, మంచినీటి వసతి తదితర సౌకర్యాలను కల్పించి ఇంటి పట్టాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ ఆర్డిఓ వెంకటేశు, కర్నూల్ రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa