కరోనా నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిర్వహించే ప్రజా ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు కోరారు. మంగళవారం ప్రజా ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు 20 నుండి 26వ తేదీ వరకు 16 డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా బిజెపి ప్రభుత్వం మాత్రం మత విద్వేషాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు ప్రతి కుటుంబానికి రూ.7500 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు మాణిక్యప్ప, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు, నాయకులు తిప్పన్న,ఇబ్రహీం,ఈరన్న పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa