కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన కోసిగిలోని తిమ్మప్ప, బసవన్న కొండలపై గత వారం రోజులుగా చిరుతపులి సంచరిస్తుందని, కొండల కింద ప్రాంతాలలో నివాసముంటున్న గొర్రెలను, మేకలను, కోతులను బలిటీసుకుందని, పులి సంచారంపై గత వారం రోజులుగా పత్రికల్లో వార్తలు ప్రచురితమవుతున్నాయి. ఎట్టకేలకు సోమవారం పులి సంచారం పై ఫారెస్ట్ అధికారి కృష్ణయ్య స్పందించారు.ఆయన మాట్లాడుతూ కొండపైకి వెళ్లి కొండ ప్రాంతాలను పరిశీలించడం జరిగిందన్నారు. చిరుతపులి నుంచి మనుషులకు ఎలాంటి ప్రమాదము ఉండదని ప్రజలే పులిపై దాడిచేస్తే అది మనపై దాడిచేస్తుందని ఆయన తెలిపారు. చిరుతపులి జింకలను, కోతులను, మేకలను, గొర్రెలపై దాడి చేస్తుంది తప్పా ప్రజలపై దాడి చేయదని భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అలాగే రోజుకు చిరుతపులి 100 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేస్తుందని ఒక కొండ నుంచి ఇంకో కొండకు మారుతుందని ప్రజలు భయపడాల్సిన పనిలేదు అన్నారు. పులిపై ఎవరు దాడిచేయవద్దు అని, ఇక్కడ నుండి ఇంకో ప్రదేశానికి అదే వెళ్తుందని ఆయన తెలిపారు. పులి వేరే ప్రదేశానికి వెళ్ళేదాక గొర్రెల కాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa