మహిళలను ఎక్కువగా బాధించే వ్యాధుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది చాలామంది మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలోనూ బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగానే ఉన్నారు. అందులోనూ అమెరికన్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా సాధారణం. అయితే చాలామంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలియదు. దీంతో వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయి. అయితే ఆరంభంలో గుర్తిస్తే ట్రీట్మెంట్ తీసుకుని బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంది.బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించవు. బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. వక్షోజాలు గట్టిపడతాయి. అలాగే ఛాతిపై ఉన్న చర్మం లోపలికి పోతుంది. చర్మం సొట్టలు పడుతుంది. అదేవ విధంగా ఛాతిపై చర్మం రంగు మారుతుంది. శరీరంలో ఇతర భాగాలపై ఉండే చర్మం కలర్ కన్నా భిన్నంగా ఆ రంగు మారుతుంది. నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి ఊడి వస్తుంది.బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగుల్లో ద్రవం బయటకు వస్తుంటుంది. కొన్ని వక్షోజాల కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సెంటర్ ఆఫ్ డీసీజ్ అండ్ ప్రివెన్సన్ ప్రకారం యూఎస్లో ప్రతి సంవత్సరం, 245,000 మందికి పైగా మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. 40,000 మందికి పైగా మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. బ్రెస్ట్ క్సాన్సర్ నుంచి రక్షణ పొందాలంటే మహిళల్లో అవగాహన పెరగాలి. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి.చూశారుగా బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల ఎన్ని ఇబ్బందులో.. కానీ దీనిపై చాలామందికి అవగాహన లేదు. నిర్లక్ష్యంగా చేయకుండా దీని గురించి తెలుసుకుంటే ఆదిలోనే దీనిని అరికట్టవచ్చు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa