కర్నూలు నగరంలోని స్థానిక రాయల్ ఫంక్షన్ లో కర్నూలు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు మరియు రైతులు ఎమ్మెల్యే ఆఫీస్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ని కలసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు.గత ఐదు నెలల నుండి పొలంలో పని చేస్తున్నా,వ్యాపారాలు చేస్తున్న కనీస సదుపాయాలు లేని పరిస్థితి . అంతేకాకుండా వర్షాలు రావడం వల్ల విక్రయాలు సరిగ్గా జరగట్లేదు. మార్కెట్ కూడా దూరంగా ఉండటం చేత ఎవరూ రాక అద్వానంగా పరిస్థితి తయారయిందని అందుకు దయ చూపి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మార్కెట్లోనే నిర్ణీత సమయంలో క్రయ విక్రయాలు జరుపుటకు అనుమతించాలని వినతి పత్రం సమర్పించారు .ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ స్పందిస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం త్వరగా చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa