ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన పేరా శ్రీధర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:20 PM

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను శుక్రవారంనాడు వైఎస్ఆర్ సీపీ నాయకులు డాక్టర్ పేరా శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ పేరా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఎన్నికల సమయంలో గుల్లదుర్తి గ్రామస్తులకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది,అందులో భాగంగా తన సొంత ఖర్చుతో గ్రామస్తులకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ గుల్లదుర్తి బస్టాండ్ లోని సాయిబాబా గుడి సమీపంలో బోరు వేసి సుమారు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను నిర్మించారని అన్నారు.నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా హృదయానంద ఆసుపత్రి ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఉండడంతో ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ఈ కార్యక్రమానికి రాలేకపోయారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టిప్పు గారి సుజాత, కాసాని నాగేంద్ర రెడ్డి , శశిధర్ రెడ్డి , పల్లె ఓబులరెడ్డి , నాగార్జున రెడ్డి , గ్రామ పెద్దలు , గ్రామస్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa