ఏపీలో కరోనా మహమ్మరి కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 55, 692 నమూనాలను పరీక్షించగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,61,247కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 1,68,029 కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 90,840 ఉన్నాయి.ఈ రోజు జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు.. అనంతపూర్ 856, చిత్తూరు 963, ఈస్ట్ గోదావరి 1504, గుంటూరు 595, కడప 784, కృష్ణ 330, కర్నూల్ 823, నెల్లూరు 682, ప్రకాశం 681, శ్రీకాకుళం 425, విశాఖపట్నం 931, విజయనగరం 569, వెస్ట్ గోదావరి జిల్లాలో 853 కేసులు నమోదయ్యాయి.ఈ రోజు జిల్లాల వారీగా నమోదైన కరోనా మరణాల వివరాలు.. తూర్పుగోదావరిలో 10, గుంటూరులో 10, అనంతపూర్ 8, కడప 7, చిత్తూరు 6, కర్నూల్ 6, నెల్లూరు 6, ప్రకాశం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 6, విజయనగరం 5, పశ్చిమగోదావరి జిల్లాలో 5 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa