ఏపీ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 9024 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 2,44,549కి చేరాయి. కరోనాతో కోలుకొని ఇప్పటి వరకు 1,54,749 మంది డిశ్చార్జు కాగా 2203 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87,597 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదయిన కరోనా కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపూర్ 959,చిత్తూరు 758,తూర్పు గోదావరి 1372,గుంటూరు 717,కడప 579,కృష్ణా 342,కర్నూల్ 1138,నెల్లూరు 364,ప్రకాశం 343,శ్రీకాకుళం 504,విశాఖ 676,విజయనగరం 594,పశ్చిమ గోదావరి 678 కరోనా కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో జిల్లాల వారీగా మరణించిన వారి వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 13 మంది, చిత్తూరులో 12 మంది, గుంటూరులో 9 మంది, ప్రకాశంలో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, కడపలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa