కేంద్ర ప్రభుత్వం జాతీయ చేనేత బోర్డును రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని, రద్దు నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని రాయలసీమ మహిళా సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల శకుంతల సోమవారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ నాయకత్వం లోని ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు దేశ స్వయం ఆర్థిక విధానాల ను అమలు చేసి దేశ స్వావలంబనను అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తుందన్నారు.అందులో భాగంగానే స్వయం ఉపాధి అవకాశాలను దెబ్బతీసేందుకు దేశవ్యాప్తంగా చేనేత రంగం అభివృద్ధికి తోడ్పడే చేనేత బోర్డును రద్దు చేయడానికి పూనుకుందన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చేనేత బోర్డును కార్పొరేట్ సంస్థలకు నరేంద్రమోడీ అప్పగించడమేనని ఆమె విమర్శించారు. ఈ చర్య వల్ల చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులు ఉపాధి కోల్పోతారు. 11 రకాలు వస్త్రాలు చేనేత కార్మికులు తయారు చేసేందుకు రిజర్వేషన్లు అమలు చేసి చేనేత రంగాన్ని కాపాడాల్సిన ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు చేనేత రంగాన్ని అప్పగించడానికే చేనేత బోర్డు రద్దు చేసే చర్యలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉపాధి కోల్పోతూ ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న చేనేత రంగాన్ని కాపాడడానికి చేనేత బోర్డు దోహద పడుతుందన్నారు. కేంద్రం ఏక పక్షంగా తీసుకున్న చేనేతబోర్డు రద్దు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జి. శకుంతల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa