ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ హతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 09, 2020, 06:18 PM

యూపీలో గ్యాంగ్‌స్టర్‌ ల ఎన్ కౌంటర్ ల పరంపర కొనసాగుతోంది. ఇటీవల జరిగిన కరుడుగట్టిన వికాస్ దూబే ఎన్ కౌంటర్ ఘటన మరవకముందే మరొకటి జరిగింది. లక్నో శివారులో ఆదివారం వేకువజామున రాకేష్ పాండే అలియాస్ హనుమాన్ పాండేను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. రాష్ట్రంలో 2005లో జరిగిన బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో రాకేష్ పాండే ప్రధాన నిందితుడు. అతని ఆచూకీ తెలిపే వారికి రూ.1 లక్ష బహుమతి ఇవ్వనున్నట్లు గతంలో పోలీసులు ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్న రాకేష్ పాండే...పలు హత్యల్లో నిందితుడు. ముక్తార్ అన్సారీ గ్యాంగ్ 23 ఏళ్లుగా సాగిస్తున్న పలు హత్యలు, కాల్పుల ఘటనల్లో ఇతను స్వయంగా పాల్గొన్నాడు.ఇతర గ్యాంగ్‌స్టర్ల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనల్లోనూ ఇతని ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం పాండేను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా అతను తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తాము ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో పాండే హతమైనట్లు చెప్పారు. 2010 నుంచి పాండేను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇలా ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. వికాస్ దూబే వ్యవహారం అనంతరం రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa