ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 02:39 PM

గుంటూరు: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ  వద్ద కొనసాగుతున్న చేనేత సత్యాగ్రహం, ఐక్య గర్జనలో పాల్గొనడానికి సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అక్క‌డి నుంచి ఆయ‌న భారీ బందోబ‌స్తు మ‌ధ్య‌ గుంటూరుకి బ‌య‌లుదేరారు. ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఈ స‌త్యాగ్ర‌హం కొన‌సాగుతోంది. త‌మ‌ సమస్యలకు పరిష్కారం కోరుతూ చేనేత కార్మికులు ఈ స‌త్యాగ్ర‌హంలో పాల్గొంటున్నారు. స‌త్యాగ్రహంలో దాదాపు 70 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ప‌వ‌న్ చేనేత కార్మికుల క‌ష్టాల గురించి మాట్లాడ‌నున్న‌ట్లు స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com