చిత్తూరు, సూర్య ప్రధాన ప్రతినిధి : చదువుకున్న యువ తకు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఎంఎస్ఎంఇ ద్వారా ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాధరెడ్డి అన్నారు. ఆదివారం పూతలపట్టు ఎంపిడిఓ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్. అమరనాధరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఈ నెల 27ను అంత ర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రేనూ ర్స్(ఎంఎస్ఎంఇ) డే గా ప్రకటించారు. దీనిని పురస్క రించుకొని ఈ నెల 27న విజయవాడ ఏ1 కన్వెన్షన్ హాల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ఎంఎస్ ఎంఇడే ను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్య క్రమానికి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లు పాల్గొంటారని చెప్పారు. అగ్రికల్చర్ సెక్టార్ లో ఎంత ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుందో అంతకంటే ఎక్కువగా ఈ ఎంఎస్ఎంఇ సెక్టార్ లో ఉపాధి కలుగుతుందనే ఉదేశ్యంతో దీనికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నా రన్నారు. ఈ సెక్టార్ లో దేశంలో మొత్తంగా 45 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ , 40శాతం తో 8 శాతం జిడిపి ఎంఎస్ఎంఇ ద్వారా వస్తోందని చెప్పారు. ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.26191 కోట్ల పెట్టుబడితో 1.10 లక్షల ఎంఎస్ఎంఇ ల ద్వారా 9.11 లక్షల మందికి ఉపాధి కలు గుతోందన్నారు. 2014 నుంచి 19193 ఎంఎస్ఎంఇల ద్వారా రూ.8738 కోట్ల పెట్టుబడులతో 2.26 లక్షల మందికి రాష్ట్రంలో ఉపాధి కల్పించామన్నారు. ఎంఎస్ ఎంఈల కొరకు ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకు రావాలని ప్రణాళికలు చేస్తున్నామన్నారు. రిస్క్లో ఉన్న పరిశ్రమ యూనిట్స్ ను బయటికి తేవాలని ప్రత్యేక పాలసీ తెస్తున్నామన్నారు. ఇందుకు బడ్జెట్లో రూ.161 కోట్లు ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్రంలో 175 నియో జకవర్గ పరిధిలో దశలవారీగా ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు 101 నియోజకవర్గాలలో ల్యాండ్స్ గుర్తించడం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 8500 ఎంఎస్ఎంఈ లకు రూ.515.42 కోట్లు ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయడం జరిగిందని, 2017-18కి 7950 ఎంఎస్ఎంఈ లకు రూ.421.44 కోట్లు ఇన్సెంటివ్స్ మంజూరుచేయనున్నట్లు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం 2015లో 2వ స్థానం, 2016లో మొదటి స్థానం పొందిందని తెలి పారు. పెట్టుబడులలో దేశంలోనే 15.8 శాతంతో ఆంధ్రప్రదేశ్ ముందుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ పార్కుల ఏర్పా టుకు ప్రత్యేక పాలసీ తెస్తున్నా మన్నారు. ఈ సెక్టార్ లో కొత్త ఎంట ర్ ప్రెన్యూర్స్గా రావాల నుకున్న వారిని ఆహ్వానిస్తున్నామ న్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు 27న కార్యక్రమానికి వస్తున్నార న్నారు. ఆ రోజు ఎంఓయూలు తీసుకో వడం జరుగు తుందని ఆయన చెప్పారు. జిల్లా, నియోజ కవర్గ స్థాయిలో ఎక్కడైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో అక్కడ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పారు. ఎస్సి, ఎస్టీలకు సంబంధించి రూ.270 కోట్ల వరకు రాయితీలు ఇవ్వడం జరుగుతోందని, వెనుకబడిన వర్గాలకు చేయుతనందించే కార్యక్రమాలు చేస్తున్నా మన్నారు. మహిళలకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధ్యాన్యత ఇస్తుందని, మహిళలను పారిశ్రామికవేతలుగా ప్రోత్సహిం చేందుకు 15శాతం వరకు రాయితీలు ఇచ్చేందుకు ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇటీవల నెల్లూరులో మహిళా పారిశ్రామిక వాడకు అనుమతి ఇవ్వడం జరిగిం దన్నారు. మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకున్న వారికి, దేశానికి అవసరం అయిన ఉత్పత్తిలు తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చే వారి అవసరం అయిన అన్ని సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. చిత్తూరులో, గాజు మం డ్యాం లో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలతో పాటు రాష్ట్రంలో మూతపడిన వాటిని తెరిపించేందుకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషద్ చైర్ పర్సన్ గీర్వాణి చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.