వల్సాద్: గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వల్సాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్ని నీళ్లతో నిండిపోయాయి. కొన్ని ఏరియాల్లో ఇళ్లలోకి నీళ్ల రావడం తో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్స్ కోసం 5 టీములను ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం. ఇప్పటికే వరదల్లో చిక్కుకున్న 9 మందిని రక్షించింది రెస్క్యూ టీమ్.