ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం పరిష్కరించకుంటే ప్రజలే పరిష్కరించుకుంటారు: నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 25, 2017, 02:35 PM

విశాఖపట్టణంలో భూ కుంభకోణాలను ప్రభుత్వం పరిష్కరించని ప్రజలే పరిష్కరించకుంటారని సీపీఐ నారాయణ అన్నారు. విశాఖ భూ ఆక్రమణల పరిశీలన అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఉంటే గుడిసెల్లో ఉండండి..లేదంటే జైట్లో ఉండండి’అని ప్రజలకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి సిట్ నివేదిక చిత్తు కాగితంలో సమానమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా నారాయణ డిమాండ్ చేశారు. కాగా, భూ ఆక్రమణల పరిశీలన నిమిత్తం ఈ రోజు అక్కడికి వెళ్లిన నారాయణ, ఫెన్సింగ్ గోడను తన్నుతుండగా గాయపడ్డారు. దీంతో, స్వల్పగాయాలైన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com