ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు మూడు రోజులనుంచి పడుతున్న వర్షాలతో ముంబై లోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముంబైలోని కింగ్స్ సర్కిల్, హింద్ మాతా ఏరియా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో అంబర్ నాథ్ - బదలాపూర్ ట్రైన్ రూట్ లో నడిచే లోకల్ ట్రైన్స్ ను క్యాన్సిల్ చేశారు సెంట్రల్ రైల్వే అధికారులు.