అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ లార్డ్ జగన్నాథ్ రథ్ యాత్ర పై మన్ కీ బాత్ లో మాట్లాడారు. ఆదివారం ప్రఖ్యాత పూరి జగన్నాథ్ రథ యాత్ర జరగనున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో జగన్నాథుడి రథ యాత్రను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని మోడీ అన్నారు. జగన్నాథుడు పేదల దేవుడని ఆయన అభివర్ణించారు. ఇంగ్లీష్ లో జగన్నాథ్(juggernaut) అంటే దివ్యమైన, బ్రహ్మాండమైన రథం అని ఆ రథాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదనే విషయం కొంతమందికే తెలుసని ఆయన విశ్లేషించారు.