మణిపూర్లోని చండెల్ లో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.5 గా నమోదు అయింది. జూన్ లోనే రెండు మూడు సార్లు మణిపూర్ లో భూమి కంపించింది. మళ్లీ ఆదివారం ఉదయం భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగలేదని ఆధికారులు పేర్కొన్నారు.