భార్య అందంగా లేదు, బక్కగా ఉందని ఓ భర్త వదిలేశాడు. తల్లిదండ్రులతో కలిసి ఆమెను పుట్టింటి తరిమేశాడు. దీంతో బాధితురాలు తల్లితో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. టిఒఐ కథనం మేరకు..కోడుమూరు మండలం వలుకూరుకు చెందిన ఈరమ్మ కూతురు మాధవిని వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన నాగమద్దయ్య, ఎల్లమ్మ కుమారుడు రామాంజనేయులుకు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకలు కూడా ఇచ్చారు. ఆరు నెలల వరకు భర్త ఆమెను బాగా చూసుకున్నాడు. ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయి. భార్య అందంగా లేదని, బక్కగా ఉందని భర్త రామాంజనేయులుతో పాటు అత్త ఎల్లమ్మ, మామ నాగమద్దయ్య పుట్టినింటికి తరిమేశారు.
ఇరు కుటుంబాల పెద్దలు రాజీ చేసేందుకు ప్రయత్నించినా తమకు అమ్మాయి ఇష్టం లేదని తెగేసి చెప్పారు. దీంతో బాధితురాలు వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈనెల 3న ఆమె తల్లితో భర్త ఇంటి ఎదుట దీక్షకు దిగింది. కోడల్ని చూసి కోపంతో ఊగిపోయిన అత్త కర్రతో దాడికి దిగడంతో మాధవి తల్లికి గాయమైంది. మాధవి మాత్ర వెనక్కు తగ్గలేదు. తన తల్లితో కలిసి అక్కడే రెండు రోజులుగా దీక్ష చేస్తోంది. చినుకులకు తడుస్తూ రాత్రి సమయాల్లోనూ తల్లితో కలిసి అక్కడే నిద్రిస్తోంది. న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు బాధిత మహిళ తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం చేస్తామంటున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa