ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోర్చుగల్ తో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా పోర్చుగల్ లో చేరుకున్న ఆయన ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్తాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఇండియా- పోర్చుగల్ స్టార్టప్ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో పాటు నానో టెక్నాలజీ సహకారం, ఉన్నత చదువులు, సైంటిఫిక్ రీసెర్చ్ ఎంఓయూలపై మోడీ, కోస్తాలు సంతకాలు చేశారు.